TS News: ఆర్కే మఠ్‌లో జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులకు సత్కారం

ABN , First Publish Date - 2022-10-03T00:08:07+05:30 IST

Hyderabad: దసరా శరన్నవరాత్రోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోన్న మఠం ఆధ్వర్యంలో ఆదివారం జీహెచ్ఎంసీ పారిశుధ్య మహిళా కార్మికులను మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద నేతృత్వంలో స్వాములు, వలంటీర్లు ఘనంగా సన్మానించారు. పారిశుధ్య కార్మికులను దుర్గామా

TS News: ఆర్కే మఠ్‌లో జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులకు సత్కారం

Hyderabad: దసరా శరన్నవరాత్రోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోన్న మఠం ఆధ్వర్యంలో ఆదివారం జీహెచ్ఎంసీ పారిశుధ్య మహిళా కార్మికులను మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద నేతృత్వంలో స్వాములు, వలంటీర్లు ఘనంగా సన్మానించారు. పారిశుధ్య కార్మికులను దుర్గామాత స్వరూపాలుగా భావించి వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. మహిళా కార్మికులకు చీర, ప్రసాదం, శారదామాత జీవిత గాథ పుస్తకం కానుకలుగా అందించారు. ఈ పారిశుద్ధ్య కార్మికులు హైదరాబాద్ నగరాన్ని నిత్యం శుభ్రంగా ఉంచడం వల్లనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారని, వారి సేవలు అమూల్యమైనవని ఈ సందర్భంగా మాట్లాడిన స్వామి బోధమయానంద కొనియాడారు. గతంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ఎలాంటి భయానికి లోనుకాకుండా ప్రాణాలకు తెగ్గించి ఈ మహిళా కార్మికులు విధులు నిర్వహించడం నిజంగా అభినందనీయమని స్వామి బోధమయానంద వారిని ప్రశంసించారు. అనంతరం మహిళా కార్మికులకు మఠంలో దర్శనం చేయించారు. రామకృష్ణ మఠం తమ సేవలను గుర్తించి స్వాములు సత్కరించడంపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.





Updated Date - 2022-10-03T00:08:07+05:30 IST