రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్

ABN , First Publish Date - 2022-01-25T03:41:16+05:30 IST

హైదరాబాద్: వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 25న (తిథి ప్రకారం) రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది.

రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్

హైదరాబాద్: వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 25న (తిథి ప్రకారం) రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది. వివేకానంద సాహిత్యంతో పాటు అనేక పుస్తకాలపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.


ఉదయం ఐదున్నరకు సుప్రభాతం, మంగళారతి, భజనలుంటాయి. 7 గంటలకు విశేష పూజ, భజనలు  పదిన్నరకు హోమం నిర్వహిస్తారు. 11 గంటలా 15 నిమిషాలకు స్వామి వివేకానంద జీవితం, సందేశంపై తెలుగులో ప్రసంగం ఉంటుంది. 11 గంటలా 40 నిమిషాలకు స్వామి వివేకానంద జీవితం, సందేశంపై ఆంగ్లంలో ప్రసంగం ఉంటుంది. 12:05 నిమిషాలకు విశేష హారతి, మధ్యాహ్నం 12:15 గంటలకు భోజన ప్రసాదం ఉంటుంది. సాయంత్రం 6:45కు ఆరాత్రికం, 7:15కు ప్రత్యేక భజనలుంటాయి.

Updated Date - 2022-01-25T03:41:16+05:30 IST