భాగ్యనగరాన్ని వదలని ముసురు
ABN , First Publish Date - 2022-07-08T14:53:48+05:30 IST
భాగ్యనగరాన్ని ముసురు వదలడం లేదు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
హైదరాబాద్: భాగ్యనగరాన్ని ముసురు వదలడం లేదు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం ఆఫీస్లకు, స్కూళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతవరణ శాఖ పేర్కొంది. అలాగే భాగ్యనగరానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.