ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో హైదరాబాద్‌లో నిరంతర నిఘా

ABN , First Publish Date - 2020-04-09T15:45:53+05:30 IST

హైదరాబాద్: వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిఘాను పెంచారు. వాహనదారులు ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం దాటితే కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందుతుంది.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో హైదరాబాద్‌లో నిరంతర నిఘా

హైదరాబాద్: వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిఘాను పెంచారు. వాహనదారులు ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం దాటితే కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందుతుంది. వాహనానికి ఉన్న నెంబర్ ప్లేట్‌ను ఫోటోలు తీసి సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్‌కు పంపుతారు. ఆర్టీఏ అధికారులు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం వాహనాలపై నిఘా పెట్టారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ తరహాలో ప్రతి చౌరస్తాలో డేటా తయారు చేస్తున్నారు. సీసీ కెమెరాలో ఉన్న ఫీడ్ ఆధారంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? వాహన నంబరు, ఫోన్ నంబరు, ఇతర వివరాలన్నీ రికార్డ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని పూర్తి ఆధారాలతో కోర్టులో హాజరు పరచేందుకు పోలీసులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు.


Updated Date - 2020-04-09T15:45:53+05:30 IST