దోపిడీ ముఠా అరెస్ట్.. 25 కిలోల బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-01-23T22:36:37+05:30 IST
దోపిడీ ముఠా అరెస్ట్.. 25 కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్: నగరంలో దోపిడీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. హోసూరు ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీకి పాల్పడ్డారు. ముత్తూట్ ఫైనాన్స్ నుంచి రూ.7కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.95 వేల నగదు దోచుకున్నారు. నిందితుల నుంచి 25 కిలోల బంగారం, రూ.93 వేల నగదు, 7 పిస్తోళ్లు, 10 మ్యాగజైన్లు, 97 రౌండ్ల బుల్లెట్లు, లారీ, కంటైనర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీ, జార్ఘండ్, మధ్యప్రదేశ్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.