శ్మశాన వాటికలో కుళ్లిన మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-06-18T14:13:10+05:30 IST
బండ్లగూడ జాగీర్ పరిధిలోని హైదర్షాకోట్ శ్మశాన వాటికలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. హైదర్షాకోట్ మూసీ ఒడ్డున
హైదరాబాద్/నార్సింగ్: బండ్లగూడ జాగీర్ పరిధిలోని హైదర్షాకోట్ శ్మశాన వాటికలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. హైదర్షాకోట్ మూసీ ఒడ్డున (40) మహిళ మృతదేహం పడి ఉండడంతో అక్కడి స్థానికులు గమనించి నార్సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గంగాధర్ క్లూస్టీమ్ బృందాలతో అక్కడి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గంగాధర్ తెలిపారు.