హైదరాబాద్: నగరంలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు సయ్యద్ అనే వ్యక్తిని అతి దారుణంగా కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన గోల్కొండ మహబూబ్కాలనీలో చోటు చేసుకుంది. వ్యక్తిని హత్య చేసిన దుండగులు నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.