హైదరాబాద్: మైలార్దేవపల్లిలో బాంబు పేలుడు కలకలం
ABN , First Publish Date - 2022-02-27T17:58:36+05:30 IST
హైదరాబాద్: మైలాదేవ్పల్లిలో బాంబు పేలుడు కలకలం రేపుతోంది.
హైదరాబాద్: మైలార్దేవపల్లిలో బాంబు పేలుడు కలకలం రేపుతోంది. ఆనంద్నగర్లో ఓ మహిళ చెత్త సేకరిస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ శరీరం చిధ్రమైంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో సంఘటన ప్రదేశానికి ఆధారాలు సేకరిస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రంగముని, సుశీల దంపతులు రోడ్ల ప్రక్కన చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాజేంద్రనగర్, మైలార్దేవపల్లి, ఆనందనగర్ పారిశ్రామిక వాడలో చెత్త సేకరించేందుకు వెళ్లారు. భర్త రంగముని వేరే స్థలంలో చెత్త సేకరిస్తున్నాడు. సుశీల రాళ్ల మధ్య చెత్తను సేకరిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఆమె అక్కడికక్కడే మృతిచెంది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.