సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: మల్లు రవి
ABN , First Publish Date - 2022-02-03T18:46:10+05:30 IST
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎందుకు రాజ్యాంగం మార్చాలో సీఎం వివరంగా చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోదీ రాజ్యాంగాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పొరాటం చేస్తుందని మల్లు రవి స్పష్టం చేశారు.