సినిమా టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2021-12-24T22:08:49+05:30 IST
తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్: తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రేట్ల పెంపుపై సర్కార్కు అధికారుల కమిటీ సిఫారసుల ప్రతిపాదనల మేరకు రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఏసీ థియేటర్లలో కనిష్టం రూ. 50.. గరిష్టం రూ. 150. మల్టీప్లెక్స్ల్లో కనిష్టం రూ.100.. గరిష్టం రూ. 250 మల్టీప్లెక్స్ల్లో రిక్లైనర్ సీట్లకు గరిష్టంగా రూ.300 టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనంగా ఉంటాయి.