HYD: ఇష్టమైన గ్రూపు ఇప్పించలేదని..

ABN , First Publish Date - 2021-11-25T18:09:43+05:30 IST

రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇంటర్‌ విద్యార్థి మృతి చెందాడు. గాజులరామారం చింతల చెరువులో మృతదేహం లభించింది. షాపూర్‌నగర్‌ మార్కెట్‌

HYD: ఇష్టమైన గ్రూపు ఇప్పించలేదని..

హైదరాబాద్/జీడిమెట్ల: రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇంటర్‌ విద్యార్థి మృతి చెందాడు. గాజులరామారం చింతల చెరువులో మృతదేహం లభించింది. షాపూర్‌నగర్‌ మార్కెట్‌ ప్రాంతంలో నివసిస్తున్న రమే్‌షకుమార్‌ కుమారుడు సుమిత్‌జాగ్రా(17) ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్‌లో తనకు ఇష్టమైన గ్రూపు ఇప్పించలేదని నిత్యం మానసికంగా కుంగిపోయేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న అదృశ్యమయ్యాడు. చింతల్‌ చెరువులో మృతదేహం లభించడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-25T18:09:43+05:30 IST