Singer హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి కేసులో కొత్త మలుపు

ABN , First Publish Date - 2021-11-25T18:03:59+05:30 IST

సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానస్పద మృతి కేసు కొత్త మలుపు తిరిగింది.

Singer హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి కేసులో కొత్త మలుపు

హైదరాబాద్: సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ లభ్యమైంది. ఓ వ్యాపారి తనను మోసం చేశారంటూ సూసైడ్ నోట్‌లో ఉంది. కాగా కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏకే రావు పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన వారం రోజులుగా కనిపించకుండా పోయారు. సుజనా ఫౌండేషన్ సీఈవోగా పనిచేస్తున్న ఏకే రావు కుటుంబం శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటుంది. ఈనెల 22న బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన కనిపించడంలేదంటూ కేసు నమోదైంది. బెంగళూర్ పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేస్తున్నారు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయని సింగర్ హరిణి తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని హరిణి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-25T18:03:59+05:30 IST