హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-07T16:38:54+05:30 IST

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీసాయి కాలనీలో స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీసాయి కాలనీలో ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫలక్ నామా ప్రభుత్వ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్ (47) అనే వ్యక్తి చింతల్, శ్రీసాయి కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యాభర్తల గొడవలే కారణంగా స్థానికులు భావిస్తున్నారు. భార్య శ్రీలత అబిడ్స్ లోని గ్రామర్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇంట్లో భార్యా, పిల్లలు లేని సమయంలో చంద్రశేఖర్ బెడ్ రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం భార్య శ్రీలత ఇంటికి వచ్చి చూడగా భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-11-07T16:38:54+05:30 IST