HYD: జవహర్నగర్లో వ్యక్తి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-10-08T16:17:52+05:30 IST
నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల డంపింగ్ యార్డ్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెట్టుకు ఉరివేసుకుని రాంకుమార్ (34)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
హైదరాబాద్: నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల డంపింగ్ యార్డ్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెట్టుకు ఉరివేసుకుని రాంకుమార్ (34)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు దమ్మాయిగూడలోని ఎమ్ఎల్ఆర్ కాలనీ నివాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.