Hyd: గాంధీభవన్లో మళ్లీ పాసుల లొల్లి..
ABN , First Publish Date - 2022-05-05T20:37:11+05:30 IST
గాంధీభవన్లో మళ్లీ పాసుల లొల్లి మొదలైంది. రాహుల్ గాంధీ టూర్, వరంగల్ రైతు సంఘర్షణ సభకు...
Hyderabad: గాంధీభవన్లో మళ్లీ పాసుల లొల్లి మొదలైంది. రాహుల్ గాంధీ టూర్, వరంగల్ రైతు సంఘర్షణ సభకు మహిళా విభాగానికి పాసులు ఇవ్వలేదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్కు బిచ్చం వేసినట్లు పాసులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. పని చేయని అనుబంధ విభాగాల నేతలకు, పీసీసీ నేతలకు వందల పాస్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో రావిర్యాల, ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభల సమయంలో కూడా పాసుల కోసం లొల్లి జరిగింది. ఇప్పుడు మళ్లీ రాహుల్ టూర్ సమయంలో పాసుల గొడవ జరిగింది.