వరద సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ విఫలం: BJP కార్పొరేటర్లు

ABN , First Publish Date - 2022-05-04T17:01:54+05:30 IST

వరద సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ విఫలమైందని బీజేపీ కార్పొరేటర్లు విమర్శించారు.

వరద సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ విఫలం: BJP కార్పొరేటర్లు

హైదరాబాద్: వరద సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ విఫలమైందని బీజేపీ కార్పొరేటర్లు విమర్శించారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం అందుబాటులో లేదని, తూతూ మంత్రంగా ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు చేపట్టారని ఆరోపించారు. కేవలం 19 డిజాస్టర్ బృందాలతో  బల్దియా సహాయక చర్యలు సరిపెట్టిందన్నారు. ఓల్డ్ సిటీ ముంపు బాధితులు సొంతంగా బోట్లను ఏర్పాటు చేసుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారన్నారు. బహదూర్ పుర, తలబ్ కట్ట ప్రాంత వాసులు వరద నీటిలో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారన్నారు. మేయర్, కమిషనర్ తీరుపై బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more