హైదరాబాద్: ఎల్బీనగర్లో టిమ్స్ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ భూమిపూజ
ABN , First Publish Date - 2022-04-26T20:30:19+05:30 IST
సీఎం కేసీఆర్ ఎల్బీనగర్ పరిధిలోని కొత్తపేట, గడ్డిఅన్నారంలో టిమ్స్ ఆస్పత్రికి భూమిపూజ చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీనగర్ పరిధిలోని కొత్తపేట, గడ్డిఅన్నారంలో టిమ్స్ ఆస్పత్రికి భూమిపూజ చేశారు. 21.36 ఎకరాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి రూ. 900 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నారు. 14 అంతస్తులతో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం చేయనున్నారు. హైదరాబాద్లో కొత్తగా మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నారు. రెండోది అల్వాల్లో 28.41 ఎకరాల్లో రూ.897 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల ఆస్పత్రి.., మూడోది సనత్నగర్లో 17 ఎకరాల్లో రూ.882 కోట్ల వ్యయంతో 14 అంతస్తుల ఆస్పత్రి నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తం ఈ మూడు ఆస్పత్రులు రూ.2,679 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.