ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బంధువుపై కేసు
ABN , First Publish Date - 2022-01-21T21:11:31+05:30 IST
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బంధువుపై హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
హైదరాబాద్: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బంధువుపై హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. మంత్రి బంధువు రూప్ కుమార్ యాదవ్ కాంట్రాక్ట్ విషయంలో ఓ వ్యక్తిపై బెదిరింపులకు దిగారు. టెండర్లు ఉపసంహరించుకోవాలని మురళీ కృష్ణా రెడ్డి అనే వ్యక్తిని ఫోన్లో బెదిరించారు. నెల్లూరులో ఓ కాంట్రాక్టుకు టెండర్ వేసిన మురళీ కృష్ణా రెడ్డిని మంత్రి అనిల్ బంధువు బెదిరించారు. టెండర్లు ఉపసంహరించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో కృష్ణారెడ్డి రాజేంద్రనగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూప్ కుమార్ యాదవ్కు ఈనెల 3న నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై ఆయన స్పందించలేదు. విచారణకు ఇప్పటి వరకు హాజరు కాలేదని పోలీసులు తెలిపారు. విచారణకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.