మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
ABN , First Publish Date - 2021-11-09T23:47:28+05:30 IST
మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. బుధవారం నుంచి మెట్రో టైమింగ్స్ మారనున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ..
హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. బుధవారం నుంచి మెట్రో టైమింగ్స్ మారనున్నాయి. ఉదయం 6 గంటల నుంచే మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాత్రి 11.15 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. మైట్రో రైళ్ల సమయంపై ట్విటర్లో మంత్రి కేటీఆర్కు ప్రజలు విజ్ఞప్తులు తెలిపారు. మంత్రి కేటీఆర్ స్పందించి మెట్రో సేవలు పెంచాలని మెట్రో అధికారులను కోరారు. కేటీఆర్ విజ్ఞప్తితో స్పందించిన అధికారులు మెట్రో రైళ్ల సమయాల్లో మార్పులు చేశారు.