సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముగ్గురు అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-18T17:51:50+05:30 IST

ఆటోల్లో వెళ్తున్న ప్రయాణికుల దృష్టి మరల్చి సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముగ్గురిని కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. బహదూర్‌పురాకు చెందిన

సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్/మారేడ్‌పల్లి : ఆటోల్లో వెళ్తున్న ప్రయాణికుల దృష్టి మరల్చి సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముగ్గురిని కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. బహదూర్‌పురాకు చెందిన అబ్దుల్‌ ఖయ్యూం, మహ్మద్‌ అజాద్‌, ఆసి్‌ఫనగర్‌కు చెందిన మహ్మద్‌ తల్ల ఆటో డ్రైవర్లు. ముగ్గురూ ముఠాగా ఏర్పడి ఆటోల్లో ప్రయాణికుల దృష్టి మరల్చి సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తిరుమలగిరిలో ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ను కార్ఖానా ప్రాంతంలో దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని రూ. 1.08 లక్షల విలువ చేసే ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-09-18T17:51:50+05:30 IST