HYD: లోన్స్ యాప్స్ కేసులో మరో కొత్త కోణం
ABN , First Publish Date - 2021-12-18T18:31:45+05:30 IST
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లోన్స్ యాప్ప్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లోన్స్ యాప్స్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.1400 కోట్లను చైనా కంపెనీలు విదేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. హాంకాంగ్, సింగపూర్, మారిషన్ దేశాలకు నిధులు బదిలీ అయ్యాయి. నకిలీ ఎయిర్ వే బిల్లులు, సర్టిఫికెట్లతో ప్రభుత్వానికి టోకరా ఇచ్చి, రూ.1400 కోట్లు ఇతర దేశాలకు మళ్లించినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారుల సమాచారంతో సీసీఎస్లో కేసు నమోదు అయ్యింది. లోన్ యాప్స్ కంపెనీలపై ఈడీ ఫిర్యాదు చేసింది. 15సీబీ నకిలీ వే బిల్లులు సృష్టించి నగదు మళ్లించినట్లు గుర్తించారు. ఈడీ ఫిర్యాదుతో సీసీఎస్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.