ఫ్రెండ్ ఫొటోతో మోసం చేసి ..
ABN , First Publish Date - 2021-06-18T17:29:47+05:30 IST
స్నేహితురాలి ఫొటోను ఉపయోగించి ఓ వ్యక్తిని ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు రెండు లక్షల దాకా కాజేశారు. ఓల్డ్ బోయినపల్లికి చెందిన దిలీ్పకుమార్ స్నేహితురాలు సుజాత
హైదరాబాద్/హిమాయత్నగర్: స్నేహితురాలి ఫొటోను ఉపయోగించి ఓ వ్యక్తిని ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు రెండు లక్షల దాకా కాజేశారు. ఓల్డ్ బోయినపల్లికి చెందిన దిలీ్పకుమార్ స్నేహితురాలు సుజాత అమెరికాలో స్థిరపడింది. రెండు రోజుల క్రితం వాట్సా్పలో ఆమె ప్రొఫైల్ ఫొటోతో ఉన్న నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అర్జంటుగా తనకు డబ్బులు కావాలని, వారం రోజుల్లో తిరిగి పంపిస్తానని, వివరాలు తర్వాత చెబుతానని ఆ మెసేజ్లో ఉన్న సారాంశం. దీంతో దిలీ్పకుమార్ మెసేజ్లో ఉన్న బ్యాంకు ఖాతా నెంబర్కు రూ.1.90లక్షలు ట్రాన్స్ఫర్ చేసాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి డబ్బులు పంపించిన విషయం చెప్పాడు. దీంతో విస్తుపోయిన సుజాత తాను ఎప్పుడు డబ్బులు అడిగానని, అసలు డబ్బులు అడగాల్సిన అవసరం ఏంలేదని చెప్పింది. దీంతో తన ఫోన్కు సుజాత ఫొటోతో వచ్చిన నెంబర్ను పంపించగా ఆ నెంబర్ తనది కాదని చెప్పింది. దీంతో మోసపోయానని గ్రహించిన దిలీ్పకుమార్ సైబర్క్రైమ్స్లో ఫిర్యాదు చేశాడు.