దిశా అత్యాచారం హత్య కేసులో నష్ట పరిహారంపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-12-16T17:31:52+05:30 IST
దిశా అత్యాచారం హత్య కేసులో ఎన్కౌంటర్ అయిన మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: దిశా అత్యాచారం హత్య కేసులో ఎన్కౌంటర్ అయిన మృతుల కుటుంబాలకు నష్ట పరిహార పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. కాగా పరిహారం చెల్లించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశం సుప్రీంకోర్టులో దిశా కమిషన్ నివేదిక పెండింగ్లో ఉందని, ఈ పఈస్థితుల్లో తాము కలుగజేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.