పార్ట్ టైం ట్యూటర్ మధు పిల్ పై హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2021-08-04T21:16:23+05:30 IST

పార్ట్ టైం ట్యూటర్ మధు పిల్ పై హైకోర్టు విచారణ

పార్ట్ టైం ట్యూటర్ మధు పిల్ పై హైకోర్టు విచారణ

హైదరాబాద్: గురుకులాల్లో సిబ్బంది నియామకం, సదుపాయాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. పార్ట్ టైం ట్యూటర్ మధు పిల్ పై హైకోర్టు విచారణ జరిపింది. సీఎం, మంత్రులను ప్రతివాదులుగా పేర్కొనడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీఎం, మంత్రుల పేర్లు తొలగించి సవరణ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు ఆదేశించింది. భవిష్యత్తులో సంబంధం లేని ప్రతివాదులను చేర్చితే పిటిషన్ స్వీకరించమని హైకోర్టు హెచ్చరించింది. పిటిషన్ పై విచారణ అక్టోబర్ 27కి కోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-08-04T21:16:23+05:30 IST