తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరలపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-07-27T21:30:28+05:30 IST

తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరలపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు హైకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-07-27T21:30:28+05:30 IST