Bjp కార్యవర్గం మెయిన్ టార్గెట్ ఏంటి?

ABN , First Publish Date - 2022-07-03T00:59:49+05:30 IST

హెచ్ఐసీసీ (HIcc)లో బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ (Pm modi), కేంద్రమంత్రి అమిత్ షా (Amith Shah), బీజేపీ...

Bjp కార్యవర్గం మెయిన్ టార్గెట్ ఏంటి?

హైదరాబాద్ (Hyderabad): హెచ్ఐసీసీ (Hicc)లో బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ (Pm modi), కేంద్రమంత్రి అమిత్ షా (Amith Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda) సహా కేంద్రమంత్రులు, తదితరులు పాల్గొన్నారు.  కాగా తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యమనే అజెండాతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‎లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికే కేంద్రమంత్రులు.. తెలంగాణ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణ అప్పులను వివరిస్తూ జనంలో తిరుగుతున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘తెలంగాణపైనే ప్రధాన దృష్టి సారించడం సరైనదేనా?. బీజేపీ విషయంలో టీఆర్ఎస్ అతి విశ్వాసానికి పోతోందా?. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్తారా?. తెలంగాణ అప్పులపై యోగి చేస్తున్న బీజేపీ ఏపీని ఎందుకు ప్రశ్నించదు?. జగన్‎తో స్నేహంపై బీజేపీ నేతలు ఎందుకు మాట దాట వేస్తున్నారు?. బీజేపీ కార్యవర్గం మెయిన్ టార్గెట్ ఏంటి?. రాష్ట్రాలను సమంగా చూడటం లేదనే విమర్శకు సమాధానమిస్తుందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-07-03T00:59:49+05:30 IST