హైదరాబాద్‌లో జంట హత్యల కేసును చేధించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-06-06T16:29:03+05:30 IST

హైదరాబాద్‌లో జంట హత్యల కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్‌లో జంట హత్యల కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌజ్‌లో జరిగిన జంట హత్యల కేసును వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు.  ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ ఆర్షద్, ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో ఉన్నారు. రౌడీ షీటర్ చంద్, స్నేహితుడు అబూలను ఆర్షద్ అండ్ గ్యాంగ్ కత్తులతో నరికి చంపారు. క్వాలిస్ వాహనంలో  ఆరుగురు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారు ముంబై వైపు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్ష్యలతోనే హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు. కొన్నాళ్ల నుంచి ఇబ్రహీం నుంచి తప్పించుకొని ముంబైలో తలదాచుకున్న చాంద్... లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చాడు.  హైదరాబాదులోని గచ్చిబౌలి, లంగర్‌హౌజ్ తదితర ప్రాంతాల్లో చాంద్ నివాసముంటున్నాడు. చాంద్‌పై రెక్కీ చేసిన ప్రత్యర్థులు పథకం ప్రకారం దాడి చేసి హత్య చేశారు. 

Updated Date - 2020-06-06T16:29:03+05:30 IST