Hyderabadలో క్రికెట్ బెట్టింగ్ గుట్టు రట్టు
ABN , First Publish Date - 2022-05-30T18:06:09+05:30 IST
నగరంలోని మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.
హైదరాబాద్: నగరంలోని మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. మియపూర్ గోకుల్ ప్లాట్స్లో ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుడు తిరుమల శెట్టి రాజేష్(27)ను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బీమవరంకు చెందిన ప్రధాన నిందితుడు వర్మ పరారీలో ఉన్నాడు. పట్టుబడ్డ నింధితుని వద్ద నుండి 4 లక్షల 52 వేల నగదు, 23 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.