పంజాగుట్ట పీఎస్‌లో సీపీ సీవీ ఆనంద్ ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2021-12-29T19:27:29+05:30 IST

నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

పంజాగుట్ట పీఎస్‌లో సీపీ సీవీ ఆనంద్ ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలీస్ స్టేషన్ పని తీరుపై  తనిఖీ చేసినట్లు చెప్పారు. ప్రతి ఏడాదీ  ఇక్కడ 600 కేసులు రిపోర్ట్ అవుతాయని... దాదాపు 175 కేసులు ఇక్కడ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. 2017లో ఈ పోలీస్‌స్టేషన్ దేశంలో బెస్ట్ రెండో పోలీస్ స్టేషన్‌గా అవార్డ్ వచ్చిందని గుర్తుచేశారు. ఇక్కడ మంచి వాష్ రూమ్‌లు, వెయిటింగ్ రూమ్‌లు ఉన్నాయని తెలిపారు. విజిటర్స్ కోసం స్పెషల్ డెస్క్ ఉందన్నారు. టాప్ ఫ్లోర్‌లో సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పవర్ సేవింగ్ దిశగా అడుగులు వేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్, లైబ్రరీ అన్ని ఉన్నాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-29T19:27:29+05:30 IST