Hyderabad: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-26T14:54:58+05:30 IST

జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు రోజులుగా కరోనా కేసులు స్పల్పంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 1,450 కేసులు

Hyderabad: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు రోజులుగా కరోనా కేసులు స్పల్పంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 1,450 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆదివారం 1,421 కేసులు, సోమవారం 1,439 కేసులు నమోదుకాగా మంగళవారం కేసుల సంఖ్య 11కు పెరిగి 1,450కి చేరింది. ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో 246 మందికి, శేరిలింగంపల్లి మండలంలో 152 మందికి, మల్కాజిగిరి సర్కిల్‌లో 245 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో 206 మందికి,  కూకట్‌పల్లి పరిధిలో 346 మందికి పాజిటివ్‌ వచ్చింది. కాగా, జ్వర సర్వేలో భాగంగా మంగళవారం వైద్య ఆరోగ్య బృందాలు నగరంలోని 50,112 ఇళ్లలో సమాచారాన్ని సేకరించాయి. 

Updated Date - 2022-01-26T14:54:58+05:30 IST