గాంధీభవన్లో నగర కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ
ABN , First Publish Date - 2021-01-21T18:27:21+05:30 IST
గాంధీ భవన్లో నగర కాంగ్రెస్ ముఖ్య నాయకులు గురువారం సమావేశమయ్యారు. గ్రేటర్ కాంగ్రెస్ను మూడు భాగాలుగా విభజించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: గాంధీ భవన్లో నగర కాంగ్రెస్ ముఖ్య నాయకులు గురువారం సమావేశమయ్యారు. గ్రేటర్ కాంగ్రెస్ను మూడు భాగాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ , సికింద్రాబాద్, మల్కాజిగిరిలకు కొత్త అధ్యక్షులను నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోస్ రాజ్,అంజన్ కుమార్ యాదవ్, కోదండ రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.