చంపాపేటలో సిరంజిలు కొని తెచ్చుకున్న ప్రజలు
ABN , First Publish Date - 2021-06-18T13:36:54+05:30 IST
చంపాపేటలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో గురువారం వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా మధ్యలో సిరంజిలు అయిపోయాయి
హైదరాబాద్/చంపాపేట : చంపాపేటలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో గురువారం వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా మధ్యలో సిరంజిలు అయిపోయాయి. దీంతో జనం ఆందోళనకు గురయ్యారు. మెడికల్ దుకాణాలకు పరుగులు తీసి రూ.10 పెట్టి ఎవరికి వారు సిరంజిలు కొని తెచ్చుకున్నారు. రోజూ ఇక్కడ సుమారు 800 నుంచి 1200 మందికి వ్యాక్సిన్ వేసేవారు. గురువారం 580 మందికి మాత్రమే వేసినట్లు శానిటేషన్ డీఈ వెంకటేష్ తెలిపారు. సుమారు 250 మంది వ్యాక్సిన్ వేయించుకోకుండానే వెళ్లిపోయారు. ఈ విషయమై సిబ్బందిని ప్రశ్నించగా తాము ఎవరినీ సిరంజిలు తెచ్చుకోమని చెప్పలేదని పేర్కొన్నారు.