వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద బీజేపీ ధర్నా

ABN , First Publish Date - 2021-05-15T16:47:14+05:30 IST

నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద బీజేపీ ధర్నా

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 20 పడకల ఐసోలేషన్ వార్డు ఉన్నా పేషంట్స్‌ను చేర్చుకోవడం లేదని,  వైద్యులు కూడా అందుబాటులో లేరని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఐసోలేషన్ వార్డులోకి పేషంట్స్‌ను తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-05-15T16:47:14+05:30 IST