మూసీని ప్రక్షాళన చేయాలంటూ బీజేపీ నేతల పాదయాత్ర

ABN , First Publish Date - 2021-07-13T17:30:56+05:30 IST

వర్షాకాలం నేపథ్యంలో మూసినదిని ప్రక్షాళ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టారు.

మూసీని ప్రక్షాళన చేయాలంటూ బీజేపీ నేతల పాదయాత్ర

హైదరాబాద్: వర్షాకాలం నేపథ్యంలో మూసినదిని ప్రక్షాళ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. ముసారంబాగ్ చౌరస్తా నుంచి మూసీనది బ్రిడ్జి వరకు పాదయాత్ర సాగనుంది. మాన్సూన్ ప్రారంభమైన మూసి రివర్ డెవలప్మెంట్ బోర్డ్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు చింతల, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ కార్పోరేటర్లు ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీ నేతల పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ క్రమంలో మూసారాంబాగ్ చౌరస్తా మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. 

Updated Date - 2021-07-13T17:30:56+05:30 IST