నేడు బీజేపీ కార్యాలయాల్లో యోగా దినోత్సవ కార్యక్రమం
ABN , First Publish Date - 2021-06-21T12:50:38+05:30 IST
నగరంలోని బీజేపీ కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరుగునున్న యోగా వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి తదితరులు పాల్గొననున్నారు. బర్కతపురాలోని బీజేపీ సిటీ ఆఫీస్లో యోగా దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు పాల్గొననున్నారు. ఉదయం 8గంలకు ముషీరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం జరుగనుంది. అలాగే మలక్ పేట్ శాలివాహనానగర్లో నల్లు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.