T.News: కడుపునొప్పి అంటూ నగదుతో బ్యాంక్ ఉద్యోగి పరార్
ABN , First Publish Date - 2022-05-11T18:08:24+05:30 IST
కడుపునొప్పి పేరుతో బ్యాంక్లోని నగదుతో బ్యాంక్ ఉద్యోగి పరారైన ఘటన నగరంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: కడుపునొప్పి పేరుతో బ్యాంక్లోని నగదుతో బ్యాంక్ ఉద్యోగి పరారైన ఘటన నగరంలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సాహెబ్నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of baroda)బ్రాంచ్లో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కడుపునొప్పి టాబ్లెట్ తెచ్చుకుంటానంటూ చీఫ్ మేనేజర్ వద్ద పర్మిషన్ అడిగిన క్యాషియర్ ప్రవీణ్... బ్యాంకులోని రూ.22 లక్షల నగదుతో పరారయ్యాడు. విషయం తెలిసిన చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు క్యాషియర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.