ఆస్పత్రి 8వ అంతస్తు నుంచి దూకి..ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-11T16:31:16+05:30 IST
జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రి 8వ అంతస్తు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా ఎద్దుమైలారం నివాసి నరసింహులు
హైదరాబాద్/బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రి 8వ అంతస్తు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా ఎద్దుమైలారం నివాసి నరసింహులు (44) నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇతడికి కొండా విశ్వేశ్వరరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. చికిత్స పొందుతున్న నరసింహులు మంగళవారం ఆస్పత్రి 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.