HYD: కార్ల టైర్లను దొంగిలిస్తున్న ముఠాను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న యువకులు
ABN , First Publish Date - 2021-08-01T18:02:14+05:30 IST
అర్ధరాత్రి ఇంట్లో చొరబడి పార్క్ చేసిన కారు టైర్లు దొంగిలించేందుకు యత్నిస్తున్న ఓ దొంగను స్థానిక యువకులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు
హైదరాబాద్/ఏఎస్ రావునగర్: అర్ధరాత్రి ఇంట్లో చొరబడి పార్క్ చేసిన కారు టైర్లు దొంగిలించేందుకు యత్నిస్తున్న ఓ దొంగను స్థానిక యువకులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి చెందిన కారు మెకానిక్ ఎం.కార్తీక్(24) శుక్రవారం అర్ధరాత్రి అదే కాలనీకి చెందిన నాగార్జున ఇంట్లోకి చొరబడ్డాడు. గేటు లోపల పార్క్ చేసిన కారు టైర్లను విప్పేం దుకు యత్నించాడు. అలికిడి శబ్ధానికి నిద్రలేచిన పక్కింటి నేమూరి మహే్షగౌడ్ కిటికిలోంచి చూడగా ఎవరో కారు టైర్లు తొలగిస్తున్నట్లు గమనించాడు. దీంతో వెంటనే అతను కాలనీలోని పవన్, సూరి కళ్యాణ్ అనే యువకులకు ఫోన్ చేసి రప్పించారు. అప్పటికీ అదే ఇంట్లో పని కానిస్తున్న దొంగ కార్తీక్ను సదరు యువకులు పట్టుకునేందుకు ప్రయత్నించగా రాడ్లు, ఇతర సామగ్రితో వారిపై దాడి చేసేందుకు యత్నించాడు. అయినా యువకులు ధైర్యంతో దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాను పక్కన ఉన్న కారు షెడ్లో మెకానిక్గా పనిచేస్తున్నానని, గుట్కాలు తినడానికి డబ్బులు లేకపోవడంతోనే టైర్లు దొంగిలించేందుకు యత్నించానని కార్తీక్ తమ విచారణలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.