ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-01T18:16:07+05:30 IST

నగరంలోని రాజేంద్రనగర్ గంధంగూడా వీకర్ సెక్షన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. దివ్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.

ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ గంధంగూడా వీకర్ సెక్షన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. దివ్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాత్ రూమ్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువతి బలవన్మరణానికి పాల్పడింది. బాత్ రూమ్‌లోనే యువతి కాలి బూడిదైపోయింది. దీంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న నార్సింగీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  యువతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2021-03-01T18:16:07+05:30 IST