పాస్పోర్ట్ స్కాంపై ప్రత్యేక టీంల ఏర్పాటుకు సీపీ చర్యలు
ABN , First Publish Date - 2021-02-24T16:07:30+05:30 IST
పాస్పోర్ట్ స్కాంపై ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ సీపీ నిర్ణయించారు.
హైదరాబాద్: పాస్పోర్ట్ స్కాంపై ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ సీపీ నిర్ణయించారు. ఆధార్ కార్డు పొందడంలో ఉన్న లూపోల్స్పై అధికారులకు సీపీ లేఖ రాయనున్నారు. ఓకే అడ్రస్పై 32 పాస్ పోర్టులు జారీ అయితే ఎవ్వరూ గుర్తించకపోవడం నిఘా సంస్థల వైఫల్యంగా తెలుస్తోంది. ఈ స్కాంతో ఇంటలిజన్స్, ఎస్.బి నిఘా వైఫల్యం బయటపడింది. నకిలీ దృవీకరణ పత్రాలు పొంది ఆధార్ కార్డులు సృష్టించిన బంగ్లా దేశీయులు... యథేచ్ఛగా భారత్లోకి అక్రమంగా చొరబడి వెస్ట్ బెంగాల్లో నకిలీ ఐడి క్రియేట్ చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఆధార్ కార్డులు తీసుకుని చేంజ్ అప్ అడ్రస్ బోధన్లో చేసుకున్నారు. బోధన్లో పోలీసులను మ్యానేజ్ చేసుకుని పాస్ పోర్టులు తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఈ వ్యహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. 72 మందిలో 19 మంది దేశం వదిలి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు...మిగతావారు ఎక్కడ ఉన్నారు..? అనేది ఇంకా బయట పడలేదు. బోధన్లో ఒక అడ్రస్ పైన 37 పాస్ పోర్టులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.