ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2021-01-12T13:28:27+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో ఆర్టీఏ అధికారులు నాలుగు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో ఆర్టీఏ అధికారులు నాలుగు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్లో తనిఖీలు చేపట్టగా  నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు బస్సులను సీజ్ చేశారు. మరో ఆరు బస్సులపై కేసు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణికులతో పాటు లగేజిని కూడా రవాణా చేస్తున్న బస్సులపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పండుగ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల అధికారులు స్పష్టం చేశారు. అటుఅంబర్ పెట్ ఔటర్ రింగు రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులను సీజ్ చేశారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-01-12T13:28:27+05:30 IST