వరద సాయం అందలేదని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-10-31T18:32:21+05:30 IST
వరద సాయం అందలేదని వ్యక్తి మృతి
హైదరాబాద్: సింగటికుంట ఉదయ్నగర్లో వరద సాయం అందలేదని వ్యక్తి మృతి చెందాడు. అధికారులు వరద సాయం నిరాకరించారని మనస్తాపంతో గుండెపోటుతో భిక్షపతి (50) మృతి చెందాడు. రిక్షాలో చెత్త సేకరిస్తూ ఆయన జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే కుమార్తె వివాహం చేశారు.