వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి..ఆపై
ABN , First Publish Date - 2020-10-20T12:39:52+05:30 IST
ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి ఆపై భారీ చోరీకి పాల్పడిన ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధి హెచ్ఎంటీనగర్లో చోటు చేసుకుంది.
హైదరాబాద్: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి ఆపై భారీ చోరీకి పాల్పడిన ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధి హెచ్ఎంటీనగర్లో చోటు చేసుకుంది. నేపాల్కు చెందిన పనిమనులు ఈ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో వారు శుభకార్యానికి వెళ్ళగా అదును చూసుకొని ఇంట్లో ఉన్న వృద్ధురాలికి దుండగులు మత్తు మందు ఇచ్చారు. ఆపై ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదుతో పాటు 18 తులాల బంగారాన్ని చోరీ చేసి పరారయ్యారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేపాలీ జంటకు సంబంధించిన ఏజెన్సీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.