బాలికను బ్లాక్‌మెయిల్ చేసిన ముగ్గురి అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-17T15:10:41+05:30 IST

నగరంలోని జీడిమెట్ల పరిధి అయోధ్యనగర్‌లో బాలికను బ్లాక్‌ మెయిల్ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలికను బ్లాక్‌మెయిల్ చేసిన ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్‌: నగరంలోని జీడిమెట్ల పరిధి అయోధ్యనగర్‌లో బాలికను బ్లాక్‌ మెయిల్ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ముగ్గురు యువకులు... ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బాలికను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ రూ.4 లక్షలు వసూలు చేశారు. నిందితులు ఎలిశా, కిశోర్‌, రాంవికాస్‌గా గుర్తించారు.  ఈనెల 14న బాలిక ఇంటికి ముగ్గురు యువకులు రాగా..వారిని కుటుంబుసభ్యులు ప్రశ్నించారు. అయితే పదవతరగతి మెటీరియల్ కోసం వచ్చినట్లు ముగ్గురు యువకులు తెలిపారు. కాగా అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు బాలికను నిలదీయగా అసలు విషయం తెలిపింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-09-17T15:10:41+05:30 IST