హైదరాబాద్లో వీధి రౌడీల హల్చల్
ABN , First Publish Date - 2020-07-16T12:40:30+05:30 IST
హైదరాబాద్లో వీధి రౌడీల హల్చల్
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ నందినగర్లో వీధి రౌడీలు హల్చల్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు యువకులపై ఐదుగురు రౌడీలు దాడి చేశారు. మద్యం బాటళ్లతో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు అరుణ్, దిలీప్గా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన అనంతరం ఐదుగురు రౌడీలు పారిపోయారు. అరుణ్, దిలీప్లపై దాడి చేసిన వారిలో ఇద్దరు నిందితులు నందినగర్కు చెందిన శేఖర్, అరుణ్గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఐపీసీ 341, 324, 427, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.