హైదరాబాద్: 10 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ABN , First Publish Date - 2020-07-11T12:23:34+05:30 IST
హైదరాబాద్: 10 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్: ఆన్లైన్లో వస్తువుల పేరుతో సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.10 లక్షలు కాజేశారు.. హైదరాబాద్ బేగంపేటకి చెందిన మహమ్మద్ యాసిన్ అహ్మద్ ఆన్లైన్లో కన్స్ట్రక్షన్ గ్లౌస్లను ఆర్డర్ చేసాడు. ఆర్డర్ చేసిన అనంతరం తనకు తెలియకుండానే తన అకౌంట్ నుండి రూ.6.88 లక్షలు కాజేశారని...వారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. మరోవైపు తనను తెలియకుండానే అకౌంట్ నుండి రూ.3.88 లక్షలు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లకిడికపూల్ కి చెందిన రజిని అనే మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.