రేపు ఉజ్జయినీ మహంకాళి బోనాలు
ABN , First Publish Date - 2020-07-11T12:00:08+05:30 IST
రేపు ఉజ్జయినీ మహంకాళి బోనాలు
హైదరాబాద్ : ఈ నెల 12న సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ తెలిపారు. శుక్రవారం మారేడుపల్లిలోని తన నివాసంలో ప్రభు త్వం తరఫున అమ్మవారికి సమర్పించనున్న పట్టువస్త్రాలను మహంకాళి ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్రెడ్డి, ఆలయ పండితులకు మంత్రి దంపతులు అందజేశారు.