మార్టిగేజ్ పేరుతో అమాయకులకు కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2021-07-23T20:23:33+05:30 IST

మార్టిగేజ్ పేరుతో అమాయకులకు ఓ మాయగాడు కోట్లలో కుచ్చుటోపి పెట్టిన ఘటన హైదరాబాద్‌లో...

మార్టిగేజ్ పేరుతో అమాయకులకు కుచ్చుటోపీ

హైదరాబాద్: మార్టిగేజ్ పేరుతో అమాయకులకు ఓ మాయగాడు కోట్లలో కుచ్చుటోపి పెట్టిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. రాజ్ మిత్ర అనే ఓ కేటుగాడు చంద్రలోక్ కాంప్లెక్స్‌లో కార్యాలయం ప్రారంభించాడు. మార్టిగేజ్ పేరుతో అమాయకులకు ఎరవేశాడు. రూ. 10 కోట్ల వరకు దండుకున్నాడు. కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న యువతిని తన భార్య అంటూ రాజ్ మిత్ర అందరినీ నమ్మబలికాడు. అయితే ఆయన వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ యువతి తన భార్య కాదంటూ మాట మార్చాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-07-23T20:23:33+05:30 IST