శామీర్‌పేట్ చెరువులో ఇద్దరు డాక్టర్ల అనుమానస్పద మృతి

ABN , First Publish Date - 2021-06-21T21:52:04+05:30 IST

హైదరాబాద్: నగర శివారు శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.

శామీర్‌పేట్ చెరువులో ఇద్దరు డాక్టర్ల అనుమానస్పద మృతి

హైదరాబాద్: నగర శివారు శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శామీర్‌పేట్ చెరువులో ఇద్దరు అన్నదమ్ములు అనుమానస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతులిద్దరూ వైద్యులని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒకరు అల్వాల్ ఎక్సైజ్ ఆస్పత్రిలో హోమియోపతి వైద్యుడు నందన్‌గా.. మరొకరు గౌతమ్‌గా పోలీసులు గుర్తించారు.


వారం రోజుల క్రితం  నందన్ వద్దకు ఆయన సోదరుడు గౌతమ్ వచ్చారు. ఇద్దరూ కలిసి నిన్న సాయంత్రం శామీర్‌పేట్ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ సరదాగా సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోదరులిద్దరూ సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో తొలుత నందన్ కాలుజారి చెరువులో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నందన్‌ను కాపాడేందుకు చెరువులోకి దూకిన గౌతమ్ కూడా నీటిలో ఊపిరాడక మృతిచెంది ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు. చెరువులోంచి ఇద్దరి మృత దేహాలను పోలీసులు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Updated Date - 2021-06-21T21:52:04+05:30 IST