భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సందడి

ABN , First Publish Date - 2021-11-05T20:32:03+05:30 IST

హైదరాబాద్: పాతబస్తీ భాగ్యలక్ష్మిదేవీ ఆలయం దగ్గర భక్తుల సందడి నెలకొంది.

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సందడి

హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మిదేవీ ఆలయం దగ్గర భక్తుల సందడి నెలకొంది. దీపావళి వేడుకలతోపాటు కార్తీక మాసం పూజల కోలాహలం మొదలైంది. ఆనవాయితీ ప్రకారం భాగ్యలక్ష్మి అమ్మవారి ఖజానాను ప్రతి ఏడాది దీపావళికి వెండి నాణెం రూపంలో భక్తులకు పంపిణీ చేశారు. ఆ నాణెం తీసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని దర్శించుకోడానికి నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు.

Updated Date - 2021-11-05T20:32:03+05:30 IST